కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవాలి

పరిశ్రమల స్థాపనతో పాటు నైపుణ్యం, ఉపాధి కల్పనపైనా శ్రద్ధ పెట్టాలి

పరిశ్రమలు, పెట్టుబడులపై మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష

తాడేపల్లి: పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎండీ రవీస్‌కుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్‌రెడ్డి, ఏపీ హై గ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ షన్‌ మోహన్, జాయింట్‌ డైరెక్టర్‌ ఇందిరా, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ జి.వి గిరి, శ్రీధర్‌ లంకా ,పరిశ్రమల శాఖ అధికారులు, ఈడీబీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈడీబీలో ఈ ఏడాది కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో మరింత మెరుగ్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమ పెట్టాలనుకునే సామాన్య ప్రజలకు కూడా అనువైన విధానాలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో పాటే నైపుణ్యం.. ఉపాధి కల్పనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top