వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
ఈసారి చంద్రబాబును నమ్మే స్థితిలో జనం లేరు
16 Jan 2019 12:12 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి
శ్రీకాకుళం : డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను సీఎం చంద్రబాబు నాయుడు మోసగించారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. 2014 ఎన్నికల సమయంలో మహిళా సంఘాల రుణాలు రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ధ్వజమెత్తారు.
పసుపు–కుంకుమ పేరుతో ప్రతి డ్వాక్రా సభ్యురాలి ఖాతాకు రూ.10వేలు జమ చేస్తామని చెప్పి ఇంతవరకు పూర్తిస్థాయిలో చెల్లించలేదని మండిపడ్డారు. రుణమాఫీ కాకపోవడంతో మహిళా సంఘాలు సభ్యులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి మోసం పూరితమైన హామీలు ఇచ్చేందుకు చంద్రబాబు వస్తాడని, ఈసారి వాటిని నమ్మే స్థితిలో జనం లేరని స్పష్టం చేశారు.