మైదుకూరు వ్య‌క్తికి కోటు వేసి దావోస్‌లో చ‌ర్చ‌లు

చంద్ర‌బాబు చేత‌కానిత‌నానికి వైయ‌స్ జ‌గ‌న్ కార‌ణ‌మంటూ ఏడుపు

వైయ‌స్ఆర్ జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా

వైయ‌స్ఆర్‌ జిల్లా: దావోస్ నే ఇక్కడకు తెస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. మైదుకూరు వ్యక్తికి కోటు వేసి చర్చలు జరపారని వైయ‌స్ఆర్ జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వీళ్ల చేతగానితనానికి కూడా వైయ‌స్ జగనే కారణమంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలందరికీ వీళ్ల చేతగానితనం, మోసం అర్థమవుతోందని, వైయ‌స్‌ జగన్‌ ఉంటే బాగుండేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. శ‌నివారం ర‌వీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని ఆయ‌న విమర్శించారు. ఏపీలో ఎక్కడ చూసినా మహిళలపై దురాగతాలు, గంజాయి, పేకాట క్లబ్‌ల పాలనే సాగుతోందన్నారు. మట్టి నుంచి ఇసుక వరకూ దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి దుష్ట దుర్మార్గ పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదని ఫైర్ అయ్యారు.

సంక్షేమ ప‌థ‌కాల‌కు పంగ‌నామాలు
వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో అమ‌లు చేసిన మత్స్యకార భరోసా, అమ్మ ఒడి వంటి అనేక పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కేవలం వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్లు చేసింది ఏమీ లేదని దుయ్య‌బ‌ట్టారు. వీళ్ల పరిపాలనకు  దావోస్‌ పర్యటన నిదర్శమని, అక్కడ కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం తెలిసిపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినవి వచ్చే వరకూ తాము ప్రజాపోరాటాలు చేస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top