ఈ ప్రభుత్వం మీది... మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను

 సీఎం వైయస్.జగన్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు. 

ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు

హెచ్‌.ఆర్‌.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది

భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండి

రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నాం

 అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం

సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యోగ సంఘాల నేతలు 

తాడేప‌ల్లి: ఈ ప్రభుత్వం మీది.. ఉద్యోగుల‌ సహకారంతో మంచి చేయగలుగుతున్నాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆదివారం సీఎం వైయ‌స్ జగన్‌తో ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత మేలు చేసినందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:

  • మీ అందరినీ సంతోషంగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. 
  • మీ అందరికి మరొక్కసారి వినయపూర్వకంగా ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. ఈ ప్రభుత్వం మీది, ఆ విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకొండి. ఈ రోజు నేను మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నాను అంటే మీ సహకారంతో చేయగలుగుతున్నాను. 
  • ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడున్న ఒమిక్రాన్ నేపధ్యంలో కూడా ఎలాంటి పరిస్తితులు ఉత్పన్నమవుతాయో.. తెలియని స్ధితి. ఈ నేపధ్యంలో మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు.
  • కానీ మనసా, వాచా, కర్మణా ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశాం. మొత్తంగా మీ పక్షాన నిలబడ్డానికి అన్నిరకాలుగా నేను సన్నద్ధంగా ఉన్నానన్నది మాత్రం కచ్చితంగా ఎప్పుడూ గుర్తుపెట్టుకొండి. 
  • రాజకీయాలు ఇందులోకి వస్తే.. ఉన్న వాతావరణం చెడిపోతుంది. 
  • రాజకీయాలకు తావు ఉండకూడదు. ఏ సమస్య ఉన్నా రండి. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీకూడా ఉంది.
  • ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు మంత్రులు, సీఎస్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌తో కూడిన మంత్రుల కమిటీ కొనసాగుతుంది. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే మనది, అంటే ఉద్యోగులు కూడా అందులో భాగమే. ఏదైనా సమస్య ఉంటే  దాన్ని పరిష్కరించుకునే మార్గం ఉంది.  అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు.
  • ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి.
  • నిన్న చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతో టచ్ లో ఉంది. నా ఆమోదంతోనే వాటన్నింటినీ కూడా మంత్రుల కమిటీ మీకు చెప్పడం జరిగింది. ఆ నిర్ణయాలు  మీకు సంతృప్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 
  • ఐ.ఆర్‌. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల రూ.5400 అదనంగా భారం పడుతోంది.
  • హెచ్‌.ఆర్‌.ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది. మొత్తం రూ.5225 కోట్లు అదనపు భారం పడుతోంది.
  • ఈ అదనంగా భారం పడేది కాకుండా ప్రతి సంవత్సరం రికరింగ్‌ వ్యయం రూపేణా మార్పు చేసిన హెచ్‌.ఆర్‌.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌ ఆఫ్ పెన్షన్ వల్ల మరో రూ450 కోట్లు, సీసీఏ రూపంలో మరో రూ.80 కోట్లు ఈ మొత్తం కలిపితే రూ.1330 కోట్లు భారం పడుతోంది. ఇంతకముందు పీఆర్సీ ప్రకారం రూ.10,247 కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతుందనుకున్నామో.. దానికి ఈ రూ.1330 కోట్లు రికరింగ్ అంటే మొత్తంగా రూ.11,577 కోట్లు  ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం రికరింగ్‌గా భారం పడుతోంది.
  • ఆర్థికంగా పడే భారం ఇది.     మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నాను. అంతకంటే వేరే ఉద్దేశ్యం లేదు. 
  • ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... రూ.5725 కోట్లు కూడా ఏదైతే మనం ఒన్ టైం ఇస్తున్నామో... ఇది మీ పోస్ట్ రిటైర్మెంట్ మీకు ఇస్తున్నాం. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి  ఇవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. 
  • మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం. నేను ఇంతకముందే చెప్పినట్లు ఈ పరిస్థితులు ఈమారిదిగా ఉండకపోయి ఉంటే... మీరందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని. మీరంతా నా దగ్గరకు చాలా సంతోషంగా వచ్చే పరిస్థితులు ఉండేవి.  దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవు.
  • రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి. 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.62వేల కోట్లు ఉంటే 2019-20లో అది 15 శాతం పెరిగి రూ.72వేల కోట్లు అయిండాలి, కానీ రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2020-21లో మళ్లీ 15 శాతం పెరిగితే అంటే రూ.72 వేల కోట్ల మీద మరో 15 శాతం పెరిగితే రూ.84వేల కోట్లు కావాలి. అలాంటి పరిస్థితుల మధ్య మన సంభాషణ జరుగుతుండాలి. అలాంటిది 2020-21లో రూ.60 వేల కోట్లలోనే నిలబడిపోయింది తప్ప పెరగలేదు. ఈ పరిస్ధితుల్లో మన సంభాషణ జరుగుతుంది.  అది చాలా దురదృష్టకరం. 
  • మరోవైపు జీతాలు విషయంలో మనం తీసుకున్న సానుకూల నిర్ణయాల వల్ల..
  • కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు వర్తింప చేశాం, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్స్ అందరి జీతాలు కూడా అన్నిరకాలుగా పెంచాం. ఇవన్నింటి వల్ల 2018-19లో ఉన్న రూ.52వేల కోట్లు శాలరీ బిల్లు ఈ సంవత్సరమే రూ.67 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు మరలా సుమారు రూ.11 వేల కోట్లు అదనం. 
  • ఇలాంటి పరిస్థితుల్లో ఈచర్చలు జరిగాయి. నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే.. మీరు లేకపోతే నేను లేను.
  • అనేక పథకాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను.
  • ఇది మీ వల్లే సాధ్యపడుతోంది. మీరు చేయలేకపోతే వ్యవస్ధలో సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. 
  • భావోద్వేగాలకు ఎప్పుడూ దయచేసి తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండి .  సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నాం. అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రిగా నేను కూడా కూర్చున్నాను. వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను. మిమ్నల్ని అందరినీ దానిలో మమేకం చేస్తాను. 
  • ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్‌ మంచిగా పెరిగేలా చూస్తాను. ఒక ఉద్యోగస్తుడుకి గొప్ప మేలు ఒక ప్రభుత్వంగా గతంలో ఎవ్వరూ చేయని విధంగా జగన్ చేశాడు అనే పరిస్థితి రావాలి. 
  • అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయ్యిన తర్వాత వాళ్ల జీవితాలు గురించి ఆలోచన చేసిన పరిస్థితి వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదే జగన్ ప్రభుత్వం మీకు చేయబోయే గొప్ప మేలు. అంత దూరం ఆలోచన చేస్తున్నాను.
  •   
  • ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్‌ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.
  • భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీకు జరిగిపోతుంది. రిటైర్ అయిన తర్వాత మీకు జరగని పరిస్థితి.. ప్రస్తుతం సీపీఎస్ లో ఉన్న పరిస్థితి కాకుండా భిన్నంగా మీకు జరిగే పరిస్థితి, మంచి పరిస్థితి ఎలా తీసుకుని రావాలా అనేదానిమీద చాలా అధ్యయనం చేస్తున్నాం. ఒక మంచి పరిష్కారంతో వస్తాం. 
  • అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను. ఏ రకంగా చేస్తాము, ఏ రకంగా మేలు చేయగలుగుతాం అన్నది కూడా చర్చిస్తాం. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను.
  • కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రోస్టర్ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల కూడా సానుకూలంగా ఉండమని ఆదేశాలు జారీ చేశాం.  దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం.
  •  
  • 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం.  పిల్లలు బాగా చదవాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పే ఇవాల్టి పరిస్థితి తీసేసి... ఇంత మంది విద్యార్ధులకు ఇంత మంది టీచర్స్ ఉండేలా తీసుకుని రావడమే కాకుండా, సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం. దీనివల్ల ఒకే టీచర్ ఒకే సబ్జెక్ట్ మీద తన ధ్యాస అంతా పెట్టగలుగుతాడు కాబట్టి తను కూడా బాగా ప్రిపేర్ అయి బాగా చెప్పగలుగుతాడు. ఇంగ్లిషు మీడియం వైపు అడుగులు వేస్తూ... బైలింగువల్ టెక్ట్స్‌  బుక్స్ అంటే ఒకపేజీ తెలుగు, ఒకపేజీ ఇంగ్లిషు రావడం వల్ల పిల్లలు సులభంగా అర్ధం చేసుకుంటారు. టీచర్ల కెపాసిటీ పెరుగుతుంది. 
  •  ఒక మంచి సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ మంచి ఫలితాలనిస్తాయి. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం.
  • ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 
  • 24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశాం. దానివల్ల ఇక్కడ కొద్దోగొప్పో అనుకున్న మేరకు న్యాయం చేయలేకపోతాం అన్న పరిస్థితి నుంచి కనీసం ఎక్కడో ఒక చోట న్యాయం జరుగుతుందన్న మంచి ఆలోచన నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లకు మేలు జరగాలనే ఇది చేశాం. 
  • అలాగే ఎంఐజీ ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. అది ఎప్పుడూ మనసులో పెట్టుకొండి. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం. మీరు చెప్పేవి వినడానికి ఈప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కానీ మీ కోసం శ్రద్ధ తీసుకునే, మీరు చెప్పేది వినే ప్రభుత్వం ఉంది. మీ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మీకు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొండి.  ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్. జగన తన ప్రసంగం ముగించారు. 
  • ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

Back to Top