సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

కోవిడ్‌ వైరస్‌ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను ప్ర‌ధానికి వివ‌రించిన‌ సీఎం వైయ‌స్‌ జగన్  
 

 న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా వ్యాప్తి ఎలా ఉంది? కట్టడికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? వ్యాక్సిన్‌ పంపిణీ, ఆక్సిజన్‌ కొరత వంటి తదితర విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.  

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ వైరస్‌ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించారు. కోవిడ్‌ వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రధానికి వివరించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచి, కోవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానిక సీఎం వైయ‌స్‌ జగన్‌ వివరించారు. 

తాజా వీడియోలు

Back to Top