తాడేపల్లి: టార్గెట్ 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తాననివైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. పార్టీ కోసం దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా పూర్తిస్థాయిలో పనిచేస్తానని పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ పార్టీ అంటే తమ పార్టీ అని, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి వెంట తాను మొదటి నుంచీ నడిచిన వ్యక్తినని అన్నారు. మంగళవారం సీఎం వైయస్ జగన్తో భేటీ అయిన అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్లో సామాజిక సమీకరణలో భాగంగా సీఎం వైయస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. అందువల్ల సీనియర్లకు అవకాశం రాలేదని చెప్పారు. సీఎం వైయస్ జగన్ తనకు హామీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. సీఎం వైయస్ జగన్ తనకు బీ ఫామ్ ఇవ్వబట్టే ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేశారు. ఆయన ఏమి చేసినా పార్టీ మంచి కోసమే చేస్తారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఎవరికీ అన్యాయం చేయరని, అందరూ పార్టీ కోసం పని చేయాల్సిందేని చెప్పారు.