వైయ‌స్ఆర్ సీపీ అనుబంధ విభాగాలకు నూత‌న కార్య‌వ‌ర్గం 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ అనుబంధ విభాగాలకు నూతన కార్యవర్గాలను నియమించ‌డం జ‌రిగింది. బీసీ, క్రిస్టియన్‌ మైనారిటీ, ముస్లిం మైనారిటీలతో పాటు రైతు, వాణిజ్య‌, చేనేత‌ విభాగాల‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గ స‌భ్యుల‌ను సైతం నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

వైయ‌స్ఆర్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తిని నియమించారు. ఉపాధ్యక్షులుగా డోలా జగన్, కాండ్రు కమల, బి.హరిప్రసాద్లతో పాటు మరో 39 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. 

వైయ‌స్ఆర్ సీపీ  క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం. జాన్సన్‌, ఉపాధ్యక్షులుగా ఎం.కొండలరావు, కేఎం. జోసఫ్, కె.మార్టిన్‌లతో పాటు మరో 42 మంది సభ్యులతో కార్యవర్గం నియమించారు. 

వైయ‌స్ఆర్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా వి.ఖాదర్ బాషా, ఉపాధ్యక్షులుగా ఐహెచ్.ఫారూఖ్, హంజా హుసైనీ నియామకంతో పాటు మరో 38 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు.

వైయ‌స్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్ నాగిరెడ్డి, ఉపాధ్యక్షులుగా త్రినాథ్ రెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, వంగల భరత్ కుమార్ రెడ్డి నియమించారు. రైతు విభాగంలో మరో 34 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. 

వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా (సంయుక్తంగా) కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణలను నియమించారు. ఉపాధ్యక్షులుగా అంబికా రాజా, కొత్త కోటేశ్వరరావుగుప్త, పమిడి సత్యనారాయణశెట్టి నియమించారు. వాణిజ్య విభాగంలో మరో 71 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. 

చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా గంజి చిరంజీవిని నియమించారు. ఉపాధ్యక్షులుగా నిమ్మన లీలారాణి, చందన నాగగౌరీశంకర కోటిలింగం, జింకా విజయలక్ష్మిలను నియమించారు. మరో 51 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు.

Back to Top