ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ విధానం
22 Aug 2019 3:30 PM
800 మద్యం షాపుల తొలగింపు
దశలవారీగా మద్యపాన నిషేధం
అమరావతి: ఎన్నికలకు ముందు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మద్యపాన నిషేదం హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశలవారీగా మద్యపాన నిషేదంలో భాగంగా షాపుల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు బేవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ ఉంటుంది. 3500 షాపులను బేవరేజేస్ కార్పొరేషన్ నిర్వహించనుంది. 800కు పైగా మద్యం షాపులను ప్రభుత్వం తగ్గించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో మద్యం షాపులు నిషేధించారు. శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా మద్యం షాపులు తొలగిస్తున్నారు. ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.