‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
వక్క తోటలను పరిశీలించిన ఎంవీఎస్ నాగిరెడ్డి
11 Nov 2021 7:02 PM
పశ్చిమ గోదావరి: జిల్లాలో సాగవుతున్న వక్క తోటలను అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి గురువారం పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బా రావు,హార్టి కల్చర్ శాఖ అధికారులతో కలిసి నాగిరెడ్డి వక్క తోటను సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, కవ్వగుంట లో విజయ సారథి వక్క తోటను పరిశీలించి వివరాలు అడిగి తెలుసున్నారు. వక్క ప్రధాన పంటగా... 40 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి, మిరియాలు, వెనీలా, తేనె టీగల పెంపకం, మినీ డైరీ నిర్వహిస్తున్నట్లు రైతు చెప్పారు. కర్ణాటక, కేరళ, అస్సాం లలో ప్రధానంగా అలానే మేఘాలయ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో లాభ సాటిగా ఉన్న వక్క తోట పెంపకం అంధ్ర ప్రదేశ్ లో చేపట్టి 25 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్న విజయ సారధి.. వక్క పంటను లాభ సాటిగా చెయ్య వఛ్హని నిరూపించారని నాగిరెడ్డి అభినందించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా లో వక్క తోటల రైతుల కృషిని అభినందించారు.