సురేష్ రెడ్డి అకాల మ‌ర‌ణం బాధాక‌రం

రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవి ఎస్ నాగిరెడ్డి

కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగిరెడ్డి

రామవరం: యువతకు ఆదర్శంగా నిలిచిన సురేష్ రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరమ‌ని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి అన్నారు. వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధికార ప్రతినిధి రామవరం ఉపసర్పంచ్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తనయుడు సురేష్ రెడ్డి ఇటీవల మరణించారు. శనివారం కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎంవి ఎస్ నాగిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ.. సురేష్ రెడ్డి గురించి విన్నాను అని, కంప్యూటర్ సాంకేతిక విద్యలో అత్యంత ప్రావీణ్యం సురేష్ రెడ్డి సంపాదించాడని, అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ మంచిపేరు సంపాదించిన వ్యక్తి సురేష్ రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం, కుటుంబానికి సమాజానికి ఎంతో నష్టం అని ఈ బాధ నుండి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు కోలుకోవాలని అన్నారు. కృష్ణారెడ్డి ని పరామర్శించిన వారిలో రాష్ట్ర రైతు నాయకులు కొవ్వూరిత్రినాద్ రెడ్డి, పారిశ్రామిక వేత్త కోనాల సూర్యనారాయణ

Back to Top