పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్కు జనరల్ మేనేజర్గా పవన్ కల్యాణ్ ఉన్నాడని, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని వైయస్ఆర్సీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇవాళ తణుకు పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో జరిగిన కాపు సోదరుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాపుల సంక్షేమం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. సీఎం వైయస్ జగన్ పాలనపై నేను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావని ప్రశ్నించారు. పవన్ పేకాట క్లబ్లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్లు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం వైయస్ జగన్ నాడే చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారు. మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. చంద్రబాబు.. లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతాడు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి. కూటమి అధికారంలోకి వస్తే సీఎం వైయస్ జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. దానికి మీకు అధికారం కావాలా?. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా?. పేదల పెన్నిది సీఎం వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలి. వైయస్ఆర్షీపీ అభ్యర్థులను గెలిపించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమబాల, ఏలూరి పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు తదితరులు పాల్గొన్నారు.