న్యూఢిల్లీ: దేశంలోని ఎన్నో పార్టీలతో ప్రేమాయణం సాగించిన వీర ప్రేమికుడు చంద్రబాబు. ప్రతి ఐదేళ్లకోసారి లవర్ ను మారుస్తూ ఉంటాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ వీర ప్రేమికునికి శుభాకాంక్షలు అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయ్యా... అబద్ధాల నరసింహా! 2019 సార్వత్రిక ఎన్నికలో మేం 22 మంది లోక్ సభ సభ్యుల్ని గెలుచుకోవటం వల్ల మీరు ఏపీకి న్యాయం చేయటం లేదా? లేక మీ పార్టీకి 301 రావటం వల్ల ఏపీకి న్యాయం చేయటం లేదా? రాష్ట్రం కోసం మేం అడగనిది లేదు. మీరు ఏం ఇచ్చారన్నది చెప్పండి చాలు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.