అందుకే బాబు కరకట్టకు వ‌చ్చార‌ని గుస‌గుస‌లు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి
 

తాడేప‌ల్లి: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసిందనివైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన, "ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చాడని గుసగుసలు. ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయి. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట. ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుంది" అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

Back to Top