లూటీ చేయడమే నీ ఫిలాసఫీ కదా బాబూ..?

ఎంపీ విజయసాయిరెడ్డి 
 

తాడేపల్లి:  పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ చంద్రబాబుదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. 'సీఎం వైయస్‌ జగన్ గారు నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. నువ్వు అధికారంలో ఉంటే 15 శాతం ఎక్సెస్ లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడివి. 
చంద్రబాబు 'కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశారట. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్లో రూ.5 భోజనం కోసం ఎదురుచూసే వాళ్లుండటమేమిటి? కుప్పంలో పేదరికమే లేదని గంటాపథంగా చెప్పాల్సిన వాడివి. ఇంత దీనపు పలుకులు ఏమిటి?' అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top