ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి 

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి:  ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ను రూ.1.50 కే ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ అందించారని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని వ్యాఖ్యానించారు. దీనివల్ల చాలీచాలని రాబడితో సతమతమవుతున్న 53,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. గత ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.3.86 చొప్పున అమ్మేదని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

Back to Top