జులై 1న కొత్త అంబులెన్స్​లు ప్రారంభం

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి   
 

తాడేప‌ల్లి:  జులై 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్​ జగన్​మోహన్ రెడ్డి కొత్త అంబులెన్స్‌లు ప్రారంభిస్తున్నార‌ని  వైయ‌స్ఆర్ ​ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద్శి, రాజ్య‌స‌భ‌ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు మంగళవారం ఆయ‌న ట్వీట్​ చేశారు.

ప్రజారోగ్యం పట్ల సీఎం వైయ‌స్​ జగన్​ తపనకు కార్యరూపంగా సరికొత్త హంగులతో 108, 104 వాహనాలు బుధవారం (జులై 1) నుంచి అందుబాటులోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. 203 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అంబులెన్సులు, మొబైల్​ క్లినిక్స్​లో వెంటీలేటర్లు, ఈసీజీ, లైఫ్ సపోర్టు వ్యవస్థలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.

స‌ర్కారీ వైద్య విప్ల‌వం
వైయ‌స్​ జగన్​ రాష్ట్రంలో సర్కారీ వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని మరో ట్వీట్​లో విజయసాయి రెడ్డి కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం వైఎస్​ రాజశేఖర్ రెడ్డి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని తీర్మానించారని వివరించారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రులు ప్రైవేటును మాత్రమే ప్రోత్సహించారన్నారు. వైఎస్​ జగన్​ ప్రభుత్వం పెద్దాయన కలలను సాకారం చేస్తోందని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top