వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మహానాడు పేరు తీసేసి “పప్పు డప్పు” అని పెట్టాలి
28 May 2021 11:51 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి
విశాఖ: టిడిపి నిర్వహిస్తున్న మహానాడుపై వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుందని ఎద్దేవా చేశారు. “వైయస్సార్ పంటల బీమా పథకంపై పడి ఏడుస్తాడు. రైతు భరోసా కింద డబ్బులిస్తే కేంద్ర నిధులంటాడు. కేంద్ర నిధులైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా చంద్రబాబూ? మహానాడులో అబద్ధాలు ప్రచారం చెయ్యడానికి సిగ్గులేదూ ? మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుంది.” అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.
చేసిన పాపాలు ఊరికేపోవు బాబూ?
ఇక అంతకు ముందు ట్వీట్ లో ఓటుకు నోటు కేసుపై కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. “మనవాళ్ళు ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్ పెద్ద పచ్చ ఫంగస్ దే అని ED కూడా తేల్చేసింది. అడ్డంగా దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం బాబుకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. 23మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను అలానే కొన్నాడు. చేసిన పాపాలు ఊరికేపోవు. ఇక దేభ్యం ముఖం వేసుకుని దిక్కులు చూడ్డమే బాబు పని.” అని పేర్కొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.