ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. అశోక్ కత్తి అందించాడు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి 
 

విశాఖ‌:  ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారిలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఇద్ద‌రూ ఉన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి  పేర్కొన్నారు. ఈ మేర‌కు విజయసాయి రెడ్డి శ‌నివారం ట్వీట్ చేశారు.  ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే... కత్తి అందించి ఖతం చేశాడు అశోక్ గజపతి అని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ నుంచి ఎన్టీఆర్ గెంటేసిన వారిలో మొదటి పేరు బాబుదైతే, రెండో పేరు అశోక్ దని చెప్పారు.

వరకట్నం, సతీసహగమనం, బహు భార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకుంటుందా? అని విజయసాయి ప్రశ్నించారు. స్త్రీలకు ఆస్తిహక్కును ఇవ్వడం మా సంస్కృతిలోను, పూసపాటి రాజ్యాంగంలోను లేదంటే చెల్లుతుందా అశోక్? అని ప్రశ్నించారు. ప్యామిలీ లా అయినా, బై లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యంగం నిర్దేశించిందని చెప్పారు. రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటవుతాయని విజయసాయిరెడ్డి  అన్నారు.
 

Back to Top