అంద‌రూ తిరిగొస్తున్నారు.. తండ్రీ కొడుకులు  ఇంట్లో దాక్కున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌కు ఇంకా క‌రోనా భీతి పోలేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం ట్వీట్ చేశారు. వేల కిలోమీటర్లు ఎగురుతూ వచ్చే వలస పక్షుల సందడి రాష్ట్రంలో మొదలైంది. లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు కూడా పనుల్లో చేరేందుకు వెనక్కి తిరిగొస్తున్నారు. ప్రవాసంలో ఉన్న తండ్రీ కొడుకులు మాత్రం కరోనా భీతితో తలుపులు బిగించుకుని ఇంట్లో దాక్కున్నారు.

Back to Top