ప్రజలపై ఎందుకింత ద్వేషం? 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: ప్రజలకు మంచి జరుగుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నాయని, ప్రజలపై వీరికి ఎందుకింత ద్వేషం? వీరి వెనుక ఎవరు ఉన్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. బాబు బిజెపిలోకి పంపిన సొంత మనిషి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టుకెళ్లి జీఓను కొట్టేయిస్తాడు. గ్లాసు పార్టీపై ఎంపీగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులెలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటీషిన్ వేస్తాడు. ప్రజలపై ఎందుకింత ద్వేషం? వీళ్ల వెనక ఉన్నదెవరు?

Back to Top