చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  మైనింగ్‌లో అడ్డ‌గోలుగా దోచుకుంది టీడీపీ నేతలు చంద్ర‌బాబు, అయ్య‌న్న పాత్రుడేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దొంగే..దొంగా దొంగా అని అరిచినట్లుంది అయ్యన్న యవ్వారం! చంద్రబాబు సీఎంగా ఉండగా నాతవరంలోని లేటరైట్ గనులను నాకేసిన ఘనుడు. చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు. గిరిజనుల పేరుతో లీజు పొంది ఏజెన్సీని కొల్లగొట్టిన గ'లీజ్ 'గాళ్లు. అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట పడటంతో ధర్నా డ్రామాలు అంటూ ట్వీట్ చేశారు.

మీడియా నడిపించే దరిద్రపు పార్టీ టీడీపీ
మీడియా నడిపించే దరిద్రపు పార్టీ ఏదన్నా ఉందంటే అది  టీడీపీనే. ఎల్లో మీడియా కట్టు కథలను వండి వడ్డిస్తుంది. పొద్దునే పచ్చ నేతలు భగ్గుమంటారు. ఉద్యమాలు, ధర్నాలు అని రెచ్చిపోతారు. అనుకుల మీడియా సపోర్టుతో నిత్యం వార్తల్లో ఉంటారేమో గానీ, ప్రజల మనసుల్లో స్థానం ఎలా దొరుకుతుంది? అంటూ విజ‌య సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top