వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
‘తండ్రీ కొడుకులను వ్యాన్లో మా రాష్ట్రానికి పంపండి’
09 May 2020 11:18 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి : హైదరాబాద్లో ఉంటూనే ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్పై వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. విమానంలోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?’ అని ట్విటర్లో పోస్ట్ చేశారు.