వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పేదలకు సహాయం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు
08 Apr 2020 1:57 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ : లాక్డౌన్ వేళ ఆపదలో ఉన్న పేదలకు నిత్యావరసరాలు, అన్నదానాలు చేస్తున్నవారందరికి వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నపిల్లలు, స్తోమత లేనివారు సైతం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పంపిస్తూ గొప్ప మనసును కనబరుస్తున్నారని ప్రశంసించారు. సాటి పౌరుల పట్ల వారికున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు. ఆపద సమయంలో పేదలకు సహాయం చేస్తున్న వారందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
ఇంతకంటే అనువైన సమయం దొరకలేదా మీకు?
ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రభుత్వం వెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని కన్నా, సిపిఐ రామకృష్ణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తుంటాడు. రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు? అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.