చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటీ లేదు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి
 

  తాడేప‌ల్లి: మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, సీఎం వైయ‌స్ జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటీ లేదని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ  విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.  పిల్లలు, తల్లుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం వైయ‌స్ జగన్ నేడు వైయ‌స్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించిన నేపథ్యంలో  విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెబుతాడని, డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చనే భ్రాంతిలో మునిగితేలుతుంటాడని  విమర్శలు చేశారు. దీనికోసం ఒక నయా పెట్టుబడిదారీ ముఠాను తయారుచేశాడని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

వైయ‌స్సార్ సంపూర్ణ పోషణ, వైయ‌స్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా 30 లక్షల 16 వేల మంది గర్భవతులు, పిల్లలు నాణ్యమైన పోషకాహారం పొందుతారని విజయసాయి రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పును చూస్తారని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

Back to Top