కాలంతో పాటు మారక పోతే ఎలా బాబూ?

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: పొరుగు రాష్ట్రంలో కూర్చుని రాళ్లు విసరడం కాదు. కరోనా నుంచి కోలుకుని ఆసుత్రులనుంచి డిస్ఛార్చి అయిన వారితో మాట్లాడితే బాగుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సూచించారు.  చికిత్స ఎలా జరిగింది, వసతులెలా ఉన్నాయి, డాక్టర్లు ఎంత శ్రధ్ద తీసుకున్నది తెలుస్తుందన్నారు. కోడి గుడ్డుపై ఈకలు పీకడమేనా? కాలంతో పాటు మారక పోతే ఎలా బాబూ? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Back to Top