ఆ ఇద్ద‌రు రాష్ట్రంలో లేరు కాబ‌ట్టే ఏపీలో ముందే వర్షాలు  

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రస్తుతం పక్క రాష్ట్రంలో ఉన్నారని... అందుకే ఏపీలో ఈసారి ముందే వర్షాలు పడుతున్నాయని సెటైర్ వేశారు. వారిద్దరూ కరువుకు మారుపేరని అన్నారు. మరో నాలుగు నెలల పాటు వారిద్దరూ ఇక్కడకు రాకపోతే రుతుపవనాలు భారీ వర్షాలను కుమ్మరిస్తాయని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సొంతంగా గెలిచే సత్తా బాబు లేదని..

ఏ ఎన్నికల్లో అయినా సొంతంగా గెలిచే సత్తా లేదనే విషయం చంద్రబాబుకు అర్థమయిందని విజయసాయిరెడ్డి అన్నారు. 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు ఎలాంటి షరతులు లేకుండా ఇంకో పార్టీకి మద్దతిస్తానని ప్రాధేయపడటం ఎక్కడా జరిగి ఉండదని విమర్శించారు. ప్రజలు ఈసడించుకుంటున్నా, బాబుకు ఆశ చావడం లేదని మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇదే తేడా ..!
ఒక్క ఇటుకను కూడా పెట్టకుండానే అమరావతి గ్రాఫిక్స్ ను చూపిస్తూ చంద్రబాబు ఐదేళ్లు గడపేశారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం వైయ‌స్ జగన్ మాత్రం తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్ల జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్ ను 15 రోజుల్లోనే పూర్తి చేశారని అన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకుడికి, పరాన్నజీవిలాంటి నాయుడికి ఇదే తేడా అని విజ‌యసాయిరెడ్డి అంత‌కు ముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Back to Top