మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు కాదా మీవి?
04 May 2020 10:52 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు మీవి కాదా? అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతలను విమర్శించారు. సోమవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నెలలో మూడుసార్లు ఫ్రీ రేషన్ ఇస్తే, ఇంకా అన్న క్యాంటీన్లు తెరవాలని రాద్దాంతం చేస్తున్నారు. అది 100 కోట్ల స్కామ్. క్యాంటీన్ల పేరుతో నిర్మించిన షెడ్లలో ఎవరెంత దోచుకున్నది త్వరలోనే బయటపడుతుంది. పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు కాదా మీవి? అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.
అందుకే సిఎం జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
కరోనా కష్టకాలంలో ఒడిషా వలస కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుకు నవీన్ పట్నాయక్ సిఎం జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అయితే, కార్మికులు స్వరాష్ట్రానికి వెళ్లడానికి ఇష్టపడలేదని, తమకు బాబు లాంటి సిఎం లేనందుకు బాధపడుతున్నామని అన్నట్టు ఎల్లోమీడియా చెలరేగేది అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.