కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయం
17 Jun 2021 5:58 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఏర్పాటు చేయడం ఖాయమైందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు తగ్గట్టు విశాఖ కేంద్రంగా అభివృద్ధి పనులు చేపడతున్నామని చెప్పారు. భూమి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెంచడం జరుగుతుందని తెలిపారు. విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొనేటప్పుడు ఆస్తులు గ్యారంటీ చూపడం సర్వసాధారణమన్నారు. జేఎన్ఎన్ యూఆర్ఎం ఇళ్ల మరమ్మతులకు ఒక్కో ఇంటికి రూ.10 వేలు కేటాయిస్తున్నామని తెలిపారు.విశాఖలో మొత్తం 8 కన్వేన్షన్ సెంటర్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.విశాఖలో తాగునీటి సమస్య లేకుండా రూ.500 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.