మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అందరం కలిసికట్టుగా పని చేస్తాం
19 Jun 2020 7:13 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరం కూడా కలిసికట్టుగా పని చేస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ నుంచి రాజ్యసభలో ఒక్కస్థానంలో ప్రస్థానంతో మొదలై ఈ రోజు ఆ బలం ఆరుకు చేరింది. ఈ ఐదేళ్లలో 11 స్థానాలకు చేరుకుంటుంది. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే శక్తి పార్టీకి ఉంటుంది. లోక్సభ, రాజ్యసభలోని సభ్యులందరం కూడా పార్టీ విధివిధాలకు అనుగుణంగా, పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ సూచనల మేరకు కలిసికట్టుగా పని చేస్తామన్నారు. రాజ్యసభకు మరో నలుగురిని పంపించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.