చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మత్య్సకార కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
21 Apr 2020 12:00 PM
విశాఖ: లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు వైయస్ఆర్సీపీ నేతలు ముందుకు వచ్చారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవాలన్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితుల్లో మానవతదృక్పథంతో స్పందించాలని కోరారు.
సీఎం వైయస్ జగన్ ఆశయానికి మీ తోడ్పాటు కావాలి
అత్యంత సురక్షిత ప్రాంతంగా రాష్ట్రానికి గుర్తింపు తేవాలన్న సీఎం వైయస్ జగన్ గారి ఆశయానికి మీ తోడ్పాటు తప్పనిసరి అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కరోనా సంక్షోభ సమయంలో ఎర్రని ఎండలను లెక్కచేయకుండా ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించే పనిలో ఉన్న ఆశా సిస్టర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సేవలు మర్చిపోలేనివని ఆయన ట్వీట్ చేశారు.