చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
సాన సతీశ్-చంద్రబాబు సంబంధాలపై కేంద్రం దర్యాప్తు చేయించాలి
29 Jul 2019 10:43 AM
విజయసాయిరెడ్డి డిమాండ్
అమరావతి: ఇటీవల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త సాన సతీశ్ తో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల సంబంధాలపై కేంద్రం దర్యాప్తు జరపాలని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. సాన సతీశ్ అనే వ్యక్తి చిన్న ఉద్యోగం చేసుకునేవాడనీ, ఆయన అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసిపెట్టే స్థాయికి ఎదగడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మనీలాండరింగ్ దళారి సానా సతీశ్తో చంద్రబాబు, ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాల పైనా కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.