దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనం గుటకాయ స్వాహా 

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

విజయవాడలో దోమల గుంపుల రియల్‌ టైమ్‌ డేటా..అవి ఆడో,మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు మింగేశారని ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే ముర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు.దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయ స్వాహా చేయడం మొదటిసారి వింటున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్‌ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది.లోకేష్‌ స్థాయికి మరిచి చెలరేగుతున్నారు.మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు.ఇప్పుడు అదే చిదంబరం ఆయన కొడుకు బెయిల్‌పై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజూ దగ్గర్లోనే ఉందని ట్విట్‌ చేశారు.

 

తాజా వీడియోలు

Back to Top