రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతి ఇవ్వాలి
09 Jul 2021 11:44 AM
కేంద్ర జలశక్తి మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
ఢిల్లీ: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ను వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయనపేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం అంశంపై కేంద్రమంత్రితో ఆయన చర్చించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని కోరామన్నారు, తెలంగాణ ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం.. ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చును సగభాగం జలజీవన్ పథకం కింద భరించాలని కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.