పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
పరువు గంగ పాలవుతుందనే బాబు పరార్
19 Aug 2019 1:33 PM
ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్
అమరావతి: వరద నీటిలో మునిగిన ప్రతిపక్ష నేత ఇంటిని డ్రోన్తో చిత్రీకరిస్తే హత్యకు కుట్ర పన్నినట్టా? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవక ముందే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని విమర్శించారు. సోమవారం ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కరకట్టపై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్ ఇంట్లో ఉన్న చంద్రబాబు ..తన విలువైన వస్తువులన్నీ తరలించారని తెలిపారు. చివరకు కృష్ణానది కావాలనే ప్రవాహాన్ని పెంటుకుంటోందని నిందించేట్టున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు బీజేపీని వదిలిపెట్టాక కుల మీడియా ఆ పార్టీని ఒక విలన్గా చిత్రీకరించిందన్నారు. మొన్నటి దాకా మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసిందని, ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారని విమర్శించారు. ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చిపడిందని, రివర్స్ గేర్ వేయక తప్పదని చెప్పారు.