అందుకే  అద్దాలమేడలో దాక్కున్నాడీ టూరిస్ట్  పొలిటీషియన్ 

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప‌క్క రాష్ట్రంలో ఉంటూ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు. రాయలసీమలో అడుగు పెడితే చంద్రబాబును జనం చితక్కొట్టేలా ఉన్నారు. కోస్తాకు వస్తే కారం పెడతారు. ఉత్తరాంధ్రకొస్తే ఉతికి ఆరేస్తారు. అందుకే హైదరాబాద్ అద్దాలమేడలో దాక్కున్నాడీ టూరిస్ట్  పొలిటీషియన్ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆయన జన్మదినం పది కోట్ల తెలుగు ప్రజలకు పండగ రోజు..
ఉచిత విద్యుత్తు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, ఇందిరమ్మ ఇళ్లు, 84 నీటి పారుదల ప్రాజెక్టులు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దివంగత మహానేత వైఎస్సార్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. ఆయన జన్మదినం పది కోట్ల తెలుగు ప్రజలకు పండగ రోజు అంటూ వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కుముందు మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top