పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలి

ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

న్యూఢిల్లీ:  పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ డిమాండు చేశారు. ఇప్పటికే అంచనాలకు సీడబ్ల్యూసీ, సాంకేతిక కమిటీ ఆమోదించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేని స్పష్టం చేశారు. పునరావాస ప్యాకేజీ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని డిమాండు చేశారు.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి: ఎంపీ వంగా గీత
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వంగా గీత అన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును ఆమోదించాలని కోరారు.

 

Back to Top