వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పేదవాడు వైద్యానికి ఇబ్బంది పడకూడదు
06 Jul 2020 1:29 PM
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ
గుంటూరు: రాష్ట్రంలోని ఏ పేదవాడు కూడా వైద్యానికి ఇబ్బంది పడకూడదని వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగంలో సమూల మార్పులు చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రతి మండలానికి 104, 108 వాహనాలను అందించిన ఘనత సీఎం వైయస్ జగన్దే అన్నారు. వైద్యరంగానికి సీఎం వైయస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా గొప్పగా వార్తలు రాస్తున్నాయని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని మోపిదేవి వివరించారు.