పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి డిమాండు  

న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి డిమాండు చేశారు. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. విభజన చట్టం ప్రకాశం పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఆమోదిస్తేనే నిర్వాసితులకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారు. 
 

Back to Top