రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కుట్రపూరితంగా తనపై ఫేక్ వీడియోలు సృష్టించారు
14 Aug 2022 7:22 PM
ఎంపీ గోరంట్ల మాధవ్
సత్యసాయి జిల్లా: టీడీపీ నేతలు కుట్రపూరితంగా తనపై ఫేక్ వీడియోలు సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్ వీడియోలను పంపారు. ఏబీఎన్ రాధాకృష్ణ, పచ్చ మీడియా కలిసి ఈ వీడియోలను ప్రసారం చేశారు. రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు.. చంద్రబాబుతో చేతులు కలిపారు. వీరంతా కలిసి బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తున్నారు. మంచి, చెడులు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని పచ్చ ఛానళ్లు చూస్తున్నాయి' అంటూ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.