పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
జగనన్న ఉన్నాడనే భరోసాతో భద్రతగా, గౌరవంగా బయటకు వచ్చాం
03 Aug 2020 9:56 AM
ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
తిరుమల: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడనే భరోసాతో భద్రతగా, గౌరవంగా బయటకు వచ్చామని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం మరో ముందడుగు వేశారు అని అన్నారు. సోమవారం ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మహిళల భద్రతకు మరో అడుగు
మా అన్న సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు. మహిళల భద్రత కోసం వైయస్ జగన్ కృషి చేస్తున్నారు. మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. రాఖీ పండగ సందర్భంగా మహిళల భద్రతకు మరో అడుగు ముందడుగు వేశారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామని రోజా పేర్కొన్నారు.
మహిళలకు 50 శాతం హక్కు..
దిశ చట్టాన్ని తీసుకురావడం ద్వారా మహిళల పై ఎంత గౌరవం ఉందో తెలుస్తోందని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళలకు 50 శాతం హక్కు కల్పించడమే కాకుండా, ఓ మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చారు. ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం పదవి కల్పించారు. ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించారు. గాజువాకలో పవన్ కల్యాణ్ని చిత్తుగా ఓడించారు. అందుకే వైజాగ్పై పవన్ కసి పెంచుకున్నారా? చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ నమ్ముతారో వారు రాజీనామా చేసి వారి చిత్తశుద్ధి చూపించాలి. చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రక్ష బంధన్ సందర్భంగా జగనన్న ఉన్నాడనే భరోసాతో భద్రతగా, గౌరవంగా బయటకు వచ్చాం. జగనన్న ఉన్నాడనే భరోసా ఇలాగే మరో 30, 40 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు.