రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సీఎం వైయస్ జగన్ సుపరిపాలనకు బద్వేల్లో పట్టం కట్టారు
02 Nov 2021 2:43 PM
ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు: బద్వేల్ ఉప ఎన్నికలో వైయస్ఆర్ సీపీ ఘన విజయం సాధించడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం సీఎం వైయస్ జగన్ సుపరిపాలనకు నిదర్శనమని, బద్వేల్ ఓటర్లు సీఎం వైయస్ జగన్కు పట్టం కట్టి మద్దతుగా నిలిచారన్నారు. బద్వేల్లో 2019లో 45 వేల మెజారిటీతో గెలిపిస్తే..ఈ రోజు 92 వేల మెజారిటీ ఇచ్చారంటే సీఎం వైయస్ జగన్ పాలనకు మార్కులు వేశారన్నారు. చంద్రబాబు..కుప్పంలో నీ వాగుడు చూశాం..ఏ సెంటర్లో ఎన్నిక జరిగినా సీఎం వైయస్ జగన్ సింగిల్ హ్యాండ్తో మట్టి కరిపిస్తారన్నారు. ఎమ్మెల్యే సీటు కాదు గదా..అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ప్రజలు తీర్పు ఇచ్చారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.