వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విద్యుత్ బిల్లుల టారిఫ్ పెంచినట్లు నిరూపించండి
22 May 2020 12:03 PM
చంద్రబాబుకు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్
విజయవాడ: విద్యుత్ బిల్లుల్లో టారిఫ్ పెంచినట్లు నిరూపించాలని ప్రతిపక్షనేత చంద్రబాబుకు వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్ విసిరారు. కరోనా కష్టకాలంలో పక్కరాష్ట్రానికి పారిపోయి ఏసీ గదుల్లో కూర్చొని ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపాడని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏపీని అప్పులపాలు చేశాడని, గత ప్రభుత్వ బకాయిలను కూడా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తీరుస్తున్నారన్నారు. టీడీపీవి దొంగ దీక్షలని ఆ పార్టీకి చెందిన నాయకుడు జేసీ దివాకర్రెడ్డి చెప్పారన్నారు.