కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఆంధ్రా, ఒడిషా ముఖ్యమంత్రులుకు ప్రత్యేక కృతజ్ఞతలు
10 Nov 2021 12:28 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు
శ్రీకాకుళం: ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యలు పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం చాలా సంతోషదాయకమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే జోగులు ఆంధ్రా, ఒడిషా ఇద్దరు ముఖ్యమంత్రులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజాం నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోటియా, జంఝావతి ,శ్రీకాకుళం జిల్లాలోని నేరడి ప్రాజెక్ట్ సమస్య పై సానుకూల వాతావరణంలో చర్చించారని ఆయన తెలిపారు. వీరి హాయంలో సమస్యలుకు పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఒడిషా ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించడం, సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా అడుగు ముందుకు వేయడం శుభదాయకం అని కంబాల జోగులు అన్నారు.