మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విద్యార్థుల బంగారు భవితకు సీఎం వైయస్ జగన్ బాటలు
02 Feb 2022 4:58 PM
"జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాల్లో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి
నెల్లూరు: విద్యార్ధుల బంగారు భవితకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాలలో భాగంగా నియోజకవర్గంలోని పిల్లలకు 50 వేల చాక్లెట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరిట వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.