మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అసత్య ఆరోపణలు, వదంతులు పుట్టించడం తగదు
20 Apr 2020 1:58 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు: ప్రతిపక్షాలు ధన ప్రభావంతో తనపై ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ప్రతిపక్షాలు తనపై సోషల్మీడియాలో అసత్య ఆరోపణలు, వదంతులు పుట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. హఫీజ్ఖాన్∙సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయిని ఆయన మండిపడ్డారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండ అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు తనపై సోషల్మీడియాలో అసత్య ఆరోపణలు, వదంతులు పుట్టిస్తున్నారని మండిపడ్డారు.
అసత్య ప్రచారంతో పచ్చ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని హఫీజ్ ఖాన్ ఆగ్రహించారు. ఇది బాధాకమని లేని ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.
మర్కజ్ వెళ్లిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, వారికి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను క్వారంటైన్ వెళ్లేవారిని తాకలేదన్నారు. క్వారంటైన్లో ఏర్పాటు చేసిన సదుపాయలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై లేని ఆరోపణలు సృష్టిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి, డీజీపీని కోరినట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు.