రోశయ్య విలక్షణమైన నేత

ఆనం రామనారాయణరెడ్డి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి ఓ విలక్షణమైన నేత అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు. గురువారం అసెంబ్లీలో రోశయ్య సంతాప తీర్మానం సభలో ఆయన మాట్లాడారు. రోశయ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసి ఇటీవల కాలం చేశారు. ఈ వార్త రెండు రాష్ట్రాల్లో ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులకు ఒక బాధ, లోటు కలిగింది. ఇవాళ ఆయన్ను మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. రోశయ్య రాజకీయ చరిత్ర పుటల్లో ఒక విలక్షణమైన అధ్యాయం. ఆయన ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంగా, అధికార పక్షంలో ఉంటూప్రతిపక్షంగా అన్ని పార్టీలను ఏ విధంగా నిలువరించేవారో సభలో చూశాం. ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. డాక్టర్‌ వైయస్‌రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఆర్థికమంత్రిగా పని చేసి వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాజకీయ జీవితంలో ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రోశయ్య నిలిచారు.
రోశయ్యలో మరోక్క విషయాన్ని గమనించాలి. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆర్థిక పరిపుష్టి ఎలా ఉంటుందంటే..ఆయన ఆర్థికశాస్త్రాన్ని చదవలేదు. మనిషి జీవితాన్ని, ప్రభుత్వ విధానాలను చదివారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సామన్య ప్రజలకు ఎలాంటి పథకాలు అందించాలని ఆలోచన చేసేవారు. ఏనాడు కూడా ఒక్క రోజు ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్లలేదు. నాడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కొంత అవహేళన కూడా చేశారు. విధానాలు ఉన్నాయని ఇష్టపూర్వకంగా అప్పులు చేయలేదు. నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విధానాలను ముందుకు నడిపించారు. కనీసం  విమాన టికెట్లు, రైలు చార్జీలు కూడా ఇవ్వలేమని రోశయ్య అనేవారు. పరిపాలనను ముందుకు తీసుకెళ్లిన భృహత్తర వ్యక్తి రోశయ్య. వైయస్‌రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాష్ట్రం ఇబ్బంది పడింది. ఆ సమయంలో పెద్దదిక్కుగా రోశయ్య ఉంటూ సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని సక్రమంగా నడిపించారు. రోశయ్య సీఎంగా ఉన్నసమయంలో కృష్ణ వరదలు ముంచెత్తాయి. శ్రీశైలం డ్యామ్‌ ఓవర్‌ ఫ్లై అయ్యే ప్రమాదం వచ్చింది. రెండు రాత్రుల్లో సెక్రటరేట్‌లో నిద్రపోయి అక్కడి నుంచి అధికారులను మానిటర్‌ చేసి సీనియర్‌ అధికారులను శ్రీశైలం పంపించారు. భగవంతుడే ఏపీని రక్షించాలని అధికారులు అంటే..రోశయ్య ఎంతో ఓర్పుతో వ్యవహరించి రాష్ట్రాన్ని కాపాడారు. ఎక్కడ ఏది మాట్లాడాలో అంతే మాట్లాడేవారు. ఆ రోజు మేం కొత్తగా సభలో అడుగుపెడితే..మీకు సమయం దొరికినప్పప్పుడు కౌన్సిల్‌ వెళ్లి రోశయ్య ప్రసంగాలు వినాలని ఆ నాటి సభ సెక్రటరీ మాకు సలహా ఇచ్చారు. డిజిటలైజేషన్‌ ఆడియోటేపులే కాకుండా, వీడియో టేపులు కూడా రీరికార్డు చేసి ప్రభుత్వ పరిపాలన ఏవిధంగా కొనసాగించాలో చెప్పే విధంగా రికార్డు చేసిన కాపీలను అందిస్తే బాగుటుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి పట్ల ఆయన సంతాపం తెలుపు..ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాప తీర్మానం  విషయంలో అన్ని తెలిసీ కూడా టీడీపీ నేతలు వివాదం సృష్టించడం బాధాకరమన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా సీఎం వైయస్‌ జగన్‌ సంతాప తీర్మానం చేయడం, నిజంగా నివాళులర్పించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top