ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
02 May 2022 3:25 PM
సీఎం వైయస్ జగన్ తిరుపతి పర్యటనపై అధికారులతో మంత్రులు సమీక్ష
తిరుపతి: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 5వ తేదీన సీఎం వైయస్ జగన్ తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో పాటు అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశీల రాఘురాం, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆదిమూలం, ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించారు.