మంత్రుల‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘ‌న విజ‌యం ‌సాధించ‌డం ప‌ట్ల హ‌ర్షం

తాడేప‌ల్లి: నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధలు, నగర పంచాయ‌తీల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డిని మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య (నాని),  వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే ఆర్‌ కె రోజా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారిని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.  

Back to Top