మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రొయ్యల ధరలు పడిపోకుండా చర్యలు
25 Jul 2020 4:21 PM
రొయ్యల ఎగుమతి ధరలపై మంత్రులు కన్నబాబు, సీదిరి అప్పలరాజు సమీక్ష
అమరావతి: రొయ్యల ధరలు పడిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రొయ్యల ఎగుమతి ధరలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రొయ్యల ఎగుమతి ధరలు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రైతులకు మేలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. రొయ్యల ధరలు పడిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.