మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బలహీనవర్గాలకు అసలైన సంక్రాంతి పండుగ
17 Dec 2020 11:15 AM
బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్ది
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
విజయవాడ: బలహీనవర్గాల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలకు అసలైన సంక్రాంతి పండుగ అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి సీఎం బంగారు బాట వేశారన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభకు మంత్రి వేణుగోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్దేనన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చారన్నారు. బీసీలను ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి సీఎం పెద్దపీట వేశారన్నారు. గత పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు.